Chittoor: కలెక్టరేట్‌ ఎదుట మహిళా రైతు ఆత్మహత్యాయత్నం

Woman Tries to Self Destruction at Chittoor District Collectorate
x

చిత్తూర్ జిల్లా కలెక్టరేట్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Chittoor: భూసమస్య పరిష్కరించడం లేదంటూ పురుగుల మందు తాగిన రమణమ్మ

Chittoor: చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌ ఎదుట మహిళా రైతు ఆత్మహత్యాయత్నం చేసుకుంది. తన భూమి సమస్య పరిష్కరించడం లేదంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. అంతేకాదు అగ్రవర్ణాలకు చెందిన రైతులు తమపై దాడి చేశారంటూ ఆరోపణలు చేసింది. ఈ విషయంపై కలెక్టర్‌, ఎస్పీకి వినతిపత్రాలు అందించినా న్యాయం జరగలేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళా రైతును మెరుగైన చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories