వివాహేతర సంబంధం : ప్రియుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన..

వివాహేతర సంబంధం : ప్రియుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన..
x
Highlights

కృష్ణా జిల్లాలో దారుణ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చిన ఘటన జి.కొండూరు మండలంలో ఆదివారం జరిగింది. కృష్ణా...

కృష్ణా జిల్లాలో దారుణ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చిన ఘటన జి.కొండూరు మండలంలో ఆదివారం జరిగింది. కృష్ణా జిల్లాలోని ముత్యాలంపాడు గ్రామానికి చెందిన ఓ మహిళతో కందులపాడుకు చెందిన కోటేశ్వరరావుకు కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఇరువురూ వివాహితులే. ఆమె కందులపాడు అడ్డరోడ్డు వద్ద చిన్నపాటి బడ్డీ కొట్టు నడుపుతూ భర్తతో విడిపోయి జీవనం సాగిస్తోంది. ఇటీవల ఆమెకి, కోటేశ్వరరావుకు స్వల్ప వివాదం ఏర్పడి కొద్ది రోజులుగా ఆయన ఆమెకు దూరంగా ఉంటున్నాడు.

దీంతో ఆమె పలుమార్లు కబురు చేయడంతో ఆదివారం సాయంత్రం ఆయన తన స్నేహితుడితో కలిసి ఆమె ఇంటికి వెళ్లాడు. తనను ఎందుకు దూరం పెట్టావంటూ ఆ మహిళ కోటేశ్వరరావుతో గొడవకు దిగింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో వివాదం పెద్దదైంది. దీంతో ఆవేశం ఆపుకోలేక ఆ మహిళ కోటేశ్వరావుపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. బయట వెయిట్ చేస్తున్న కోటేశ్వరరావు స్నేహితుడు వెంటనే అప్రమత్తమై చుట్టుపక్కల వాళ్ల సహాయంతో మంటలు ఆర్పి, అతడ్ని హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. శరీరం చాలా భాగం కాలిపోవడంతో ప్రస్తుతం కోటేశ్వరావు మృత్యువుతో పోరాడుతున్నాడు. స్నేహితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories