
MP MVV Satyanarayana: సీఎం జగన్ను కలవనున్న విశాఖ ఎంపీ ఎవీవీ సత్యనారాయణ
MP MVV Satyanarayana: ఇందుకోసం వారు ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు
MP MVV Satyanarayana: విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సీఎం జగన్ను కలవనున్నారు. ఇందుకోసం వారు ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. కాసేపట్లో జగన్తో సమావేశంకానున్నారు. అయితే తన ఫ్యామిలీ కిడ్నాప్ వ్యవహారం తర్వాత ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. జగన్తో సమావేశంకానుండటం ఇదే తొలిసారి. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు, అతని వ్యాపార భాగస్వామి జీవీల కిడ్నాప్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. భూ దందాల లావాదేవీల్లో తేడాలతో కిడ్నాప్ డ్రామా చోటు చేసుకుందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని. అప్పుడే అసలైన నిజాలు బయటకు వస్తాయని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్తో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఆడిటర్ జీవీలు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




