ఇవాళ్టి నుంచి విజయవాడలో స్విగ్గీ ఆర్డర్లు బంద్

ఇవాళ్టి నుంచి విజయవాడలో స్విగ్గీ ఆర్డర్లు బంద్
x
Highlights

ఇవాళ్టి ఉదయం నుంచి విజయవాడలో స్విగ్గీ ఆర్డర్లు నిలిచిపోనున్నాయి. ఫుడ్ ఆర్డర్లపై కమిషన్ ను పెంచుకుంటూ పోవడం, వినియోగదారులకు చేసే కాల్ ఛార్జీలను తమపైనే...

ఇవాళ్టి ఉదయం నుంచి విజయవాడలో స్విగ్గీ ఆర్డర్లు నిలిచిపోనున్నాయి. ఫుడ్ ఆర్డర్లపై కమిషన్ ను పెంచుకుంటూ పోవడం, వినియోగదారులకు చేసే కాల్ ఛార్జీలను తమపైనే రుద్దడం, రహస్య ఛార్జీల విధింపుపై హోటల్ ఓనర్స్ భగ్గు మంటున్నారు. ఒక్కో ఫుడ్ ఆర్డర్ విలువపై కమిషన్ ను 10 శాతం నుంచి 25శాతానికి పెంచుతూ ఫుడ్ ఆర్డర్ యాప్ లైన స్విగ్గీ, ఉబర్ ఈట్స్ నిర్ణయం తీసుకున్నాయి. స్విగ్గీ అయితే మిగతా యాప్ ల కంటే మరింత ముందుకెళ్లి హిడెన్ ఛార్జీలను కూడా వేధిస్తోందని హోటళ్ల యజమానులు ఆరోపిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories