Tirumala: తిరుమలలో వైభవంగా స్వర్ణ రథోత్సవం

Tirumala: తిరుమలలో వైభవంగా స్వర్ణ రథోత్సవం
x

Tirumala: తిరుమలలో వైభవంగా స్వర్ణ రథోత్సవం

Highlights

Tirumala: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది.

Tirumala: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. ఈ విశిష్ట సందర్భంలో శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో స్వర్ణ రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు.

మలయప్ప స్వామి స్వర్ణ రథోత్సవం

శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు బంగారు రథంపై అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. గోవింద నామస్మరణల మధ్య మాడ వీధుల్లో సాగిన ఈ ఊరేగింపులో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తరించారు. రథంపై విహరిస్తున్న స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని చూసి భక్తులు పులకించిపోయారు.

ముక్కోటి ఏకాదశి: ఉత్తర ద్వార దర్శనం

వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిర్వహించే ఉత్తర ద్వార (వైకుంఠ ద్వార) దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు పోటెత్తారు. సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా తితిదే (TTD) పకడ్బందీ ఏర్పాట్లు చేసినప్పటికీ, భక్తుల సంఖ్య భారీగా ఉండటంతో తిరుమల గిరులు జనసంద్రంగా మారాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories