
Andhra Pradesh: ఏపీలో రోడ్ల దుస్థితిపై కేంద్ర మంత్రి ట్వీట్.. రీట్వీట్ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు
Andhra Pradesh: నరకం చూపుతున్న రోడ్లపై వ్యంగ్యంగా ట్వీట్
Andhra Pradesh: ఏపీలో రోడ్ల దుస్థితిపై కేంద్ర మంత్రి మురళీధరన్ ట్వీట్ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రీట్వీట్ చేస్తూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ పాలనను కేంద్ర మంత్రులు సైతం గుర్తించారంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ పాలసీలు చూసో సాధించిన మంచి ఫలితాలు చూసో కాదు... నరకం చూపుతున్న రోడ్లను చూసి అంటూ చంద్రబాబు వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. రోడ్ల మరమ్మతులపై సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ ప్రజలు రోడ్డు దాట లేకపోతున్నారని ట్వీట్లో పేర్కొన్నారు.
.@ysjagan పాలనను కేంద్ర మంత్రులు సైతం గుర్తించారు. అయితే ప్రభుత్వంలోని ఉత్తమ పాలసీలు చూసో... బెస్ట్ రిజల్ట్ చూసో కాదు. ఎపిలో మూడున్నరేళ్లుగా ప్రజలకు నరకం చూపుతున్న రోడ్లను చూసి.(1/2)#ChatthaRoadsChatthaCM #APRoads #WorstRoads #JaganFailedCM https://t.co/cv8BuDkcBv
— N Chandrababu Naidu (@ncbn) October 17, 2022
వైసిపి ప్రభుత్వానికి ఇది సిగ్గుగా అనిపించడం లేదా? రోడ్ల మరమ్మతులపై సిఎం మాటలు కోటలు దాటుతున్నాయి కానీ... ప్రజలు రోడ్డు దాటలేకపోతున్నారు.(2/2)
— N Chandrababu Naidu (@ncbn) October 17, 2022

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire