Bhumana Karunakar Reddy: సీఎం చంద్రబాబు టీటీడీకి తీరని ద్రోహం చేస్తున్నారు

Bhumana Karunakar Reddy: టీటీడీకి చెందిన అత్యంత విలువైన భూములను ఒబెరాయ్ గ్రూప్‌కు కట్టబెట్టడంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నిప్పులు చెరిగారు.

Arun Chilukuri
Published on: 17 Dec 2025 6:01 PM IST
Bhumana Karunakar Reddy: సీఎం చంద్రబాబు టీటీడీకి తీరని ద్రోహం చేస్తున్నారు
X

Bhumana Karunakar Reddy: టీటీడీకి చెందిన అత్యంత విలువైన భూములను ఒబెరాయ్ గ్రూప్‌కు కట్టబెట్టడంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి నిప్పులు చెరిగారు. ఇది సాక్షాత్తు ఆ శ్రీవారికే పెడుతున్న మూడు నామాలని ఆయన విమర్శించారు. సీఎం చంద్రబాబు టీటీడీకి తీరని ద్రోహం చేస్తున్నారని.. మూడు వేల కోట్ల విలువైన భూమిని ఒబెరాయ్ గ్రూప్‌కు కట్టబెడుతూ జీవో ఇచ్చి 4 రోజులు దాటుతున్నా.. ఎందుకు ఆన్‌లైన్‌లో పెట్టలేదు అంటూ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం చివరకు వెంకటేశ్వర స్వామిని కూడా వదలడం లేదని స్వామీజీలు, పీఠాధిపతులు తక్షణమే స్పందించాలని కోరారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అంశంపై నోరు విప్పాలని భూమన డిమాండ్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story