Tirupati: తిరుపతిలో మృతదేహాల కలకలం.. ఒకే ఇంట్లో మూడు మృతదేహాలు లభ్యం

Tirupati: తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విషాదం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 2 Dec 2025 11:07 AM IST
Tirupati: తిరుపతిలో మృతదేహాల కలకలం.. ఒకే ఇంట్లో మూడు మృతదేహాలు లభ్యం
X

Tirupati: తిరుపతిలో మృతదేహాల కలకలం.. ఒకే ఇంట్లో మూడు మృతదేహాలు లభ్యం

Tirupati: తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. దామినేడు ఇందిరమ్మ గృహాల్లో మృతదేహాలు తీవ్ర కలకలం రేపాయి. ఒకే ఇంట్లో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు తమిళనాడుకు చెందిన సత్యరాజ్‌, పొన్నాగుట్టె నాయగి, మూడేళ్ల కుమారుడు మనీష్‌గా గుర్తించారు. సత్యరాజ్‌తో పొన్నాగుట్టె నాయగి సహజీవనం చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. గత మూడు నెలల క్రితం గుడియాత్తం నుంచి తిరుచానూరుకు వచ్చి కూలీ పనులు చేసుకుంటూ వీరు జీవిస్తున్నారు.

అయితే.. గత నెల 22వ తేదీ నుంచి వీరంతా బయటకు రాకపోవడంతో.. గది నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంటి తలుపులు తెరచి చూడగా.. లోపల మూడు మృతదేహాలు కుళ్లిన స్థితిలో ఉన్నాయి. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. హత్యా..? ఆత్మహత్యా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story