AP School Tragedy: స్కూల్‌లో స్లాబ్‌ పెచ్చు ఊడిపడి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృతి

AP School Tragedy: అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో విషాదం చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 21 Nov 2025 3:00 PM IST
AP School Tragedy: స్కూల్‌లో స్లాబ్‌ పెచ్చు ఊడిపడి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మృతి
X

AP School Tragedy: అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం స్లాబ్‌ పెచ్చులు ఊడిపడి టీచర్‌ మృతి చెందిన ఘటన.. స్థానికంగా విషాదాన్ని నింపింది. రాజానగరం జెడ్పీ హైస్కూల్‌లో ఈ ఘటన జరిగింది. స్కూల్‌లో ప్రేయర్‌ అనంతరం.. నిర్మాణంలో ఉన్న భవనం పక్కన నిల్చుని ఉన్న ఇంగ్లీష్‌ టీచర్‌ జోష్నా భాయ్‌పై ప్రమాదవశాత్తు స్లాబ్‌ పెచ్చులు ఊడిపడ్డాయి.

ఈ ఘటనలో టీచర్‌కు తలకు తీవ్రగాయం కావడంతో హుటాహుటిన ఆమెను తుని ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో టీచర్‌ మృతి చెందారు. దీంతో స్కూల్‌లో విషాదఛాయలు అలుముకున్నామి. మృతురాలి స్వస్థలం కాకినాడ జిల్లా తునిగా తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story