Anantapur: కొడుకు గొంతు కోసి తల్లి ఆత్మహత్య

Anantapur: అనంతపురం జిల్లా కేంద్రంలోని శారదా నగర్ ప్రాంతంలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది.

Arun Chilukuri
Published on: 28 Nov 2025 11:14 AM IST
Anantapur: కొడుకు గొంతు కోసి తల్లి ఆత్మహత్య
X

Anantapur: కొడుకు గొంతు కోసి తల్లి ఆత్మహత్య

Anantapur: అనంతపురం జిల్లా కేంద్రంలోని శారదా నగర్ ప్రాంతంలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఒక తల్లి తన మూడేళ్ల కుమారుడి గొంతు కోసి హతమార్చిన అనంతరం, తాను కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. మృతురాలు అమూల్యగా గుర్తించారు. ఆమె రామగిరి డిప్యూటీ తహసీల్దార్ అయిన రవి భార్య అని తెలిసింది. కుటుంబ కలహాలు లేదా వ్యక్తిగత సమస్యల కారణంగానే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే, అసలు కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, పూర్తి వివరాల కోసం దర్యాప్తు ప్రారంభించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story