Tirumala: భక్తులతో కళకళలాడుతున్న తిరుమల క్షేత్రం

Tirumala Tirupati Devasthanams with Devotees | AP News Today
x

Tirumala: భక్తులతో కళకళలాడుతున్న తిరుమల క్షేత్రం

Highlights

Tirumala: భారీగా పెరిగిన దేవదేవుడి హుండీ ఆదాయం

Tirumala: కోటాను కోట్లు భక్తులు కలిగిన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుడికి భక్తిప్రపత్తులతో భక్తులు సమర్పిస్తున్న కానుకలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. గడిచిన రెండేళ్లు కొవిడ్ తో సందడి లేని తిరుమలలో ప్రస్తుతం మునుపటి పరిస్థితులు ఏర్పడ్డాయి. గత 90 రోజులు చూస్తే ఏ రోజు 3కోట్లు తగ్గకుండా ఆ దేవదేవునికి భక్తులు సమర్పించే హుండీ కానుకల ద్వారా ఆదాయం సమకూరుతుంది. వడ్డీ కాసులవాడి హుండీ కళకళలాడుతోంది.

అఖిలాండ కోటి బ్రహ్మండనాయకుడైన శ్రీవారి దర్శనార్దం ప్రపంచం నలుమూలల నుండి భక్తులు తిరుమలకు వస్తుంటారు. కోవిడ్‌ తీవ్రత తగ్గడంతో ఏడు కొండలకు భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో తిరుమల క్షేత్రం భక్తులతో భక్తులతో కళకళ లాడుతోంది. గతంలో వారాంతపు రోజులలో, విశేష పర్వదినాలలో మాత్రమే రద్దీ అధికంగా వుంటుంది. ఆ రోజుల్లో మాత్రమే హుండీ ఆదాయం ఎక్కువ వచ్చేది. అయితే ప్రస్తుతం భక్తుల రద్దీకి సంబంధం లేకుండా హుండీ కానుకలు మాత్రం 3 కోట్లకు పైగా లభిస్తుంది 2020 సంవత్సరం వరకు పెరుగుతూ వచ్చినా ఆదాయం ఆ తర్వాత కరోనా కారణంగా పూర్తిగా తగ్గిపోయింది. 80 రోజులు పాటు దర్శనాలు నిలివేశాకా, తర్వాత కూడా పరిమితంగానే భక్తులను అనుమతించారు. దీంతో 2020 సంవత్సరానికి 1300 కోట్ల రూపాయల వరకు హుండీ ఆదాయం వస్తుందని అనుకుంటే 700 కోట్ల రూపాయలకు తగ్గిపోయింది. 2021లో కూడా 900 కోట్లు మాత్రమే వచ్చింది.

కోవిడ్ తీవ్రత తగ్గడంతో శ్రీవారి భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. అయితే ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యతో సంబంధం లేకుండా శ్రీవారికి ఒక రోజుకు సరాసరి హుండీ ద్వారా రూ. 3 నుండి రూ‌. 4 కోట్లు కానుకల రూపంలో లభిస్తుంది. గత మూడు నెలల గణాంకాల పరిశీలిస్తే ఫిబ్రవరి నెలలో స్వామివారిని 10,95,724 లక్షల మంది ద‌ర్శించుకోగా హుండీ ద్వారా 79కోట్ల 34 లక్షల రూపాయలు హుండీ కానుకల ద్వారా ఆదాయం లభించింది. మార్చి నెలలో 19,72,656 మంది ద‌ర్శించుకోగా హుండీ ద్వారా 128 కోట్ల 61 లక్షల రూపాయల ఆదాయం లభించింది. ఏప్రిల్ నెలలో శ్రీవారిని 20,62,323 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ద్వారా 127 కోట్ల 63 లక్షలు, ఆన్‌లైన్ లో ఈ-హుండీ ద్వారా 4కోట్ల 4 లక్షల ఆదాయం లభించింది. మొత్తానికి గతంలో మాదిరిగా శ్రీవారిపై కాసుల వర్షం కురుస్తుండడంపై టీటీడీ సంతోషం వ్యక్తం చేస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories