ట్రిబుల్ ఆర్ కాదు... ట్రిబుల్ ఎస్... ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారిన SSS..

Three SSS in YSRCP Have Become Key Persons in the Govt
x

ట్రిబుల్ ఆర్ కాదు... ట్రిబుల్ ఎస్... ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారిన SSS..

Highlights

Three SSS in YSRCP: వైసీపీ అధికారంలోకి వచ్చాక పవర్ సెంటర్లుగా మారారు ఆ ముగ్గురు.

Three SSS in YSRCP: వైసీపీ అధికారంలోకి వచ్చాక పవర్ సెంటర్లుగా మారారు ఆ ముగ్గురు. సీఎం జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా కీలక సలహాలిస్తూ ఆ ముగ్గురు తెర ముందు, తెర వెనుక చక్రం తిప్పేవారు. ఇప్పుడు ఆ ముగ్గురు పార్టీలో మరింత యాక్టివ్ రోల్స్ లోకి వచ్చేందుకు జగన్ రంగం సిద్ధం చేశారు. ట్రిబుల్ ఎస్‌లు ఇప్పుడు అన్ని వ్యవహారాలను తామై చక్కదిద్దుతున్నారు.

జిల్లాలో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు, పర్యటనల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. జగన్ ఆదేశాలతో రంగంలోకి సజ్జల, సాయిరెడ్డి, సుబ్బారెడ్డి రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జిలతో నిత్యం టచ్‌లో ఉంటున్నారు. ట్రిబుల్ ఎస్ గురించి ఇప్పుడు పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. గతంలో లేనిది ఇప్పుడు ముగ్గురు కలిసి రాజకీయాలు చేయడమేంటని చెవులు కొరుక్కుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories