Andhra Pradesh: హైకోర్టు ఆదేశాలను పట్టించుకోని ఏపీ ప్రభుత్వం

The AP Government Ignored the High Court Orders
x

Andhra Pradesh: హైకోర్టు ఆదేశాలను పట్టించుకోని ఏపీ ప్రభుత్వం 

Highlights

Andhra Pradesh: *మూడేళ్ల జగన్ పాలనలో ఇటుకకూడా పడలేదు *చంద్రబాబు నాయుడు హయాంలో కట్టిన భవనాల్లోనే పాలన చేస్తున్నారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టు ఆదేశాలను సైతం పక్కనబెట్టి నిరంకుశ పాలన చేస్తోందని తెలుగుదేశంపార్టీ ఎంపీలు కనకమేడల రవీందర్, రామ్మోహన్ నాయుడు ధ్వజమెత్తారు. అమరావతిలో ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయని, మూడేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్మాణపనులు చేపట్టలేదని మండిపడ్డారు. చంద్రబాబునాయుడు హయాంలో కట్టిన భవనాల్లో కూర్చొని పాలనసాగిస్తున్నారని గుర్తుచేశారు. అమరావతిని రాజధాని కేంద్రంగా కొనసాగించాలని హైకోర్టు తీర్పును అమలు చేయడానికి సిద్ధంగా ఉందో లేదోనని అఫిడవిట్ ప్రభుత్వం ఎందుకు తెలుపలేదని ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories