గుంటూరులో మాజీమంత్రి అంబటి వర్సెస్‌ పోలీసులు

గుంటూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఆందోళనకు దిగింది.

Arun Chilukuri
Published on: 12 Nov 2025 12:57 PM IST
గుంటూరులో మాజీమంత్రి అంబటి వర్సెస్‌ పోలీసులు
X

గుంటూరులో మాజీమంత్రి అంబటి వర్సెస్‌ పోలీసులు

గుంటూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఆందోళనకు దిగింది. ఇందులో భాగంగా వైసీపీ ర్యాలీలో మాజీమంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. అయితే బారికేడ్లు పెట్టి ర్యాలీని అడ్డుకునేప్రయత్నం చేశారు పోలీసులు. పోలీసుల తీరుపై అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పట్టాభిపురం సీఐ, అంబటి మధ్య మాటలయుద్ధం జరిగింది.

అనంతరం బారికేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లారు అంబటి రాంబాబు. పేద ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోమని, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. పోలీసులను మంత్రి లోకేష్‌ పంపినట్టు స్పష్టంగా తెలుస్తోందని ఆరోపించారు. పోలీసుల ద్వారా ఉద్యమాన్ని అణచివేద్దామని చూస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు అంబటి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story