సాహితీ వేత్త ఇంద్రకంటి శ్రీకాంత శర్మ కన్నుమూత

సాహితీ వేత్త ఇంద్రకంటి శ్రీకాంత శర్మ కన్నుమూత
x
Highlights

సాహితీ లోకానికి తీరని విషాదం. ప్రముఖ కవి, సాహితీ వేత్త ఇంద్రగంటి శ్రీకాంత శర్మ (75) ఈ తెల్లవారుజామున హైదరాబాద్ లో కన్ను మూశారు. తెలుగు సాహితీ లోకంలో...

సాహితీ లోకానికి తీరని విషాదం. ప్రముఖ కవి, సాహితీ వేత్త ఇంద్రగంటి శ్రీకాంత శర్మ (75) ఈ తెల్లవారుజామున హైదరాబాద్ లో కన్ను మూశారు. తెలుగు సాహితీ లోకంలో ఆయన ప్రత్యేక స్థానాన్ని పొందారు. శ్రీకాంత శర్మ మృతి సాహిత్య లోకానికి తీరని లోటంటూ పలువురు సంతాపాన్ని వెలిబుచ్చారు.

తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురంలో మే 29 ,1944న జన్మించారు. తొలుత ఆయన 1976లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలొ అసిస్టెంట్ ఎడిటర్‌ గా చేరారు. ఆపై ఆకాశవాణి కేంద్రానికి విశేష సేవలందించారు. ఎన్నో లలిత గేయాలు, కవితలు, సాహిత్య వ్యాసాలను అందించారు. రేడియో నాటికలు, నాటకాలు, డాక్యుమెంటరీలు, సంగీత రూపకాలను రచించి పేరు తెచ్చుకున్నారు. కృష్ణావతారం, నెలవంక, రావు- గోపాలరావు తదితర సినిమాలకు పాటలు రాశారు. ఇటీవల 'సమ్మోహనం' చిత్రంలో 'మనసైనదేదో...' అనే గీతాన్ని రాశారు. ఈయన తనయుడు ఇంద్రకంటి మోహన కృష్ణ తెలుగు సినీ దర్శకుడుగా ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories