Chandrababu: ముందస్తుకు వెళితే రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుంది

TDP Ready for Early Elections Says Chandrababu
x

Chandrababu: ముందస్తుకు వెళితే రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుంది

Highlights

Chandrababu: ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చినా వాటిని ఎదుర్కొనేందుకు టీడీపీ సిద్ధంగా ఉందన్నారు పార్టీ అధినేత చంద్రబాబు.

Chandrababu: ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చినా వాటిని ఎదుర్కొనేందుకు టీడీపీ సిద్ధంగా ఉందన్నారు పార్టీ అధినేత చంద్రబాబు. ఎన్నికలకు మరో 18 నెలల సమయం ఉందని కానీ సీఎం జగన్ ముందస్తుకు వెళ్లినా సిద్ధమే అన్నారు. సీఎం జ‌గ‌న్‌ ముందస్తు ఎన్నికలకు వెళితే రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోతుందని చంద్ర‌బాబు పేర్కొన్నారు. టీడీపీ రాష్ట్ర కమిటీ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ విజయం సాధించాలని అందుకు ప్రతీ ఒక్క కార్యకర్త కష్టపడాలని పిలుపునిచ్చారు. అయితే పొత్తులపై తానెప్పుడూ మాట్లాడలేదని సమయాన్ని బట్టి నిర్ణయాలుంటాయని క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు.

Show Full Article
Print Article
Next Story
More Stories