'మండలి' రద్దుపై ఎమ్మెల్యే గంటా.. వైఎస్ తీసుకొచ్చిన మండలికి జగన్ మంగళం పాడారు

మండలి రద్దుపై ఎమ్మెల్యే గంటా.. వైఎస్ తీసుకొచ్చిన మండలికి జగన్ మంగళం పాడారు
x
ఎమ్మెల్యే గంటా
Highlights

రాజధాని బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపారన్న ఉక్రోశంతో శాసనమండలిని రద్దు చేయడం సరికాదని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. వైఎస్...

రాజధాని బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపారన్న ఉక్రోశంతో శాసనమండలిని రద్దు చేయడం సరికాదని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎంతో ఆలోచన కృషిచేసి మండలిని తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి దానికి మంగళం పలికారని మండిపడ్డారు. మండలి రద్దుకు తీర్మానం చేసినా వెంటనే అమల్లోకి వచ్చే పరిస్థితి లేదన్నారు.

ఇక, విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటుపై తమ నిర్ణయం చంద్రబాబుకు చెప్పామని ఆయన, తమ అభిప్రాయాన్ని గౌరవించారని గంటా అన్నారు. మంగళవారం నాడు విశాఖ టీడీపీ కార్యాలయంలో ఉత్తర నియోజకవర్గ కార్యకర్తలతో గంటా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. జీవీఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న నేపథ్యంలో కార్యకర్తలతో గంటా సమావేశమయ్యారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories