కోర్టులో లొంగిపోయిన అచ్చెన్నాయుడు

కోర్టులో లొంగిపోయిన అచ్చెన్నాయుడు
x
Highlights

ఏపీ మాజీమంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. పోలీసు విధులను అడ్డుకోవడం.. వాగ్వాదానికి దిగిన విషయమై తాడేపల్లి పోలీస్...

ఏపీ మాజీమంత్రి అచ్చెన్నాయుడు శుక్రవారం మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. పోలీసు విధులను అడ్డుకోవడం.. వాగ్వాదానికి దిగిన విషయమై తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. ఆ కేసులో అచ్చెన్నకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే స్థానిక కోర్టులో లొంగిపోవాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయన శుక్రవారం మంగళగిరి కోర్టుకు హాజరయ్యారు. రూ.50వేల పూచికత్తుతో అచ్చెన్నాయుడుకు మంగళగిరి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. కాగా ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టేందుకే కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories