టీడీపీ మహానాడు ప్రారంభం

టీడీపీ మహానాడు ప్రారంభం
x
Highlights

తెలుగుదేశం పార్టీ 'మహానాడు' ప్రారంభమైంది. టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రాహానికి చంద్రబాబు నివాళులర్పించి.. పార్టీ జెండా ఆవిష్కరించారు. బుధ,...

తెలుగుదేశం పార్టీ 'మహానాడు' ప్రారంభమైంది. టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రాహానికి చంద్రబాబు నివాళులర్పించి.. పార్టీ జెండా ఆవిష్కరించారు. బుధ, గురువారాల్లో ఈ సారి మహానాడు జరగబోతోంది. ఎప్పుడూ అట్టహాసంగా నిర్వహించే ఈ వేడుకను కరోనా నేపధ్యంలో ఆన్ లైన్ వేడుకగా నిర్వహించే ఏర్పాట్లు చేసుకుంది తెలుగుదేశం పార్టీ. పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, చిన రాజప్ప, నారా లోకేశ్‌, అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బోండా ఉమా తదితరులు పాల్గొన్నారు.

కరోనా వైరస్ ముప్పుతో లాక్ డౌన్ పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. జూమ్ యాప్ ద్వారా వీడియో ఛాట్ మీటింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories