జగన్ ఢిల్లీ పర్యటనపై రాజకీయ విమర్శలు..మరో ఇద్దరు మంత్రులను కలవకుండానే..

జగన్ ఢిల్లీ పర్యటనపై రాజకీయ విమర్శలు..మరో ఇద్దరు మంత్రులను కలవకుండానే..
x
Highlights

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై రాజకీయ విమర్శలు చెలరేగుతున్నాయి. నిన్న ఢిల్లీ వెళ్లిన జగన్‌కు సుదీర్ఘ ఎదురుచూపులు తర్వాత అమిత్‌షా అపాయింట్...

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై రాజకీయ విమర్శలు చెలరేగుతున్నాయి. నిన్న ఢిల్లీ వెళ్లిన జగన్‌కు సుదీర్ఘ ఎదురుచూపులు తర్వాత అమిత్‌షా అపాయింట్ మెంట్‌ ఇవ్వడం అదే సమయంలో మరో ఇద్దరు కేంద్ర మంత్రులను కలవకుండానే వెనుదిరగడంపై టీడీపీ విమర్శలు చేస్తోంది. అయితే, తెలుగుదేశం ఆరోపణలకు కౌంటరిచ్చిన వైసీపీ అమిత్‌షాతో 45 నిమిషాల పాటు సమావేశమైన జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా ఏపీ సమస్యలపై చర్చించారని తెలిపింది. బిజీ షెడ్యూల్‌తో తీరిక లేకపోయినా అమిత్‌షా అపాయింట్‌మెంట్ ఇచ్చారని వైసీపీ చెప్పుకొచ్చింది. ఇక, ఏపీ సమస్యలపై ఇతర మంత్రులతో తాను మాట్లాడతానని అమిత్‌షా మాటివ్వడంతోనే సీఎం జగన్‌ ఢిల్లీ నుంచి వెనుదిరిగారని వివరణ ఇచ్చింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories