కాల్ సెంటర్‌కు టీడీపీ నేత ఫోన్... జగన్‌పైనే ఫిర్యాదు

కాల్ సెంటర్‌కు టీడీపీ నేత ఫోన్... జగన్‌పైనే ఫిర్యాదు
x
జగన్‌
Highlights

ఏపీ ప్రభుత్వం అవినీతిని కట్టడి చేసేందుకు ఇటీవల ఓ టోల్ ఫ్రీ నెంబర్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రజలు అవినీతికి సంబంధించిన ఈ కాల్ సెంటర్‌కు...

ఏపీ ప్రభుత్వం అవినీతిని కట్టడి చేసేందుకు ఇటీవల ఓ టోల్ ఫ్రీ నెంబర్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ప్రజలు అవినీతికి సంబంధించిన ఈ కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేయొచ్చని ఏపీ సీఎం జగన్ తెలిపారు. తాజాగా ఈ కాల్ సెంటర్‌కు ఏపీ టీడీపీ నేత వర్ల రామయ్య కాల్ చేశారు.

వైఎస్ హయాంలో తండ్రి రాజశేఖర్ రెడ్డి అధికారం అడ్డంపెట్టుకుని జగన్ వేల కోట్లు సంపాదించారని ఫిర్యాదు చేశారు. అలాగే జగన్ రాజకీయ అవినీతిపైనా ఐఐఎం అధ్యయనం చేయాలన్నారు. ఫిర్యాదును సచివాలయం తీసుకెళ్లి ఎవరైనా అధికారులకు ఇవ్వాలని కాల్ సెంటర్ సిబ్బంది టీడీపీ నేత వర్ల రామయ్యకు సూచించారు. సీఎం జగన్ ప్రకటించినట్లుగా తాను ఇచ్చిన ఫిర్యాదుపై 15 రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రూ. 43 వేల కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు అభియోగాలు పెట్టుకుని అవినీతిని అంతమొందిస్తా అని జగన్ ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు.





Show Full Article
Print Article
Next Story
More Stories