వైసీపీ ప్రభుత్వంపై బోండా ఉమ తీవ్ర విమర్శలు!

వైసీపీ ప్రభుత్వంపై బోండా ఉమ తీవ్ర విమర్శలు!
x
Bonda Uma (File Photo)
Highlights

కరోనా కేసుల పెరుగుతున్న కొద్దీ ఏపీలో రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం పెరుగుతుంది.

కరోనా కేసుల పెరుగుతున్న కొద్దీ ఏపీలో రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం పెరుగుతుంది. ఇప్పటికే కరోనా కిట్ల కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు చెబుతున్న తెలుగు దేశం పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది. తాజాగా ఇదే అంశంపై మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ వైసీపీ నేత, రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ మేరకు ట్విట్టర్ లో వరుస ట్వీట్లు చేశారు.

కరోనా కిట్లపై ఆంధ్రప్రదేశ్ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పిట్టకథలు చెబుతున్నారని, కరోనా కిట్ల కొనుగోలులో జరిగిన అక్రమాలు త్వరలోనే వెలుగు చూస్తాయని, చత్తీస్ గడ్ రూ.300 చొప్పున కొంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.700 చొప్పున కొనుగోలు ఎలా చేసింది అని పేర్కొన్నారు.

కరోనా కిట్ల కొనుగోలులో వందల కోట్ల రూపాయల కమిషన్ కొట్టేశారని అన్నారు. మంత్రి బుగ్గన బంధువు డైరెక్టర్ గా ఉన్న కంపెనీ నుంచి కేవలం కొటేషన్ ద్వారా కిట్లను కొనుగోలు చేశారని బోండా ఆరోపించారు. కేంద్రం కరోనా వైరస్ కట్టడికి ఇచ్చిన 2400 కోట్ల రూపాయలు ఏమయ్యాయో ఎవరి జేబుల్లోకి వెళ్లాయో సమాధానం చెప్పండి అంటూ ప్రశ్నించారు.

ప్రభుత్వ వైఫల్యం వల్ల కరోనా వైరస్ వ్యాప్తిలో దేశంలోని టాప్ టెన్ రాష్ట్రాల్లో మన రాష్ట్రం చోటు చేసుకుంది. అదే సమయంలో దక్షిణాదిలో ప్రథమ స్థానంలో ఉంది.. టెస్టులు, కేసుల ధ్రువీకరణ, మరణాల సంఖ్య వంటి విషయాల్లో ప్రభుత్వం పూర్తి అవాస్తవాలు చెబుతోందని బోండా ఆరోపణలు చేశారు.








Show Full Article
Print Article
More On
Next Story
More Stories