Chandrababu: ఏపీ సీఎస్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

TDP Chief Chandrababu Letter to Andhra Pradesh CS | AP News Today
x

ఏపీ సీఎస్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ 

Highlights

Chandrababu: కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో గ్రానైట్ అక్రమ మైనింగ్‌, రవాణాపై లేఖ

Chandrababu: ఏపీ సీఎస్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో గ్రానైట్ అక్రమ మైనింగ్‌, రవాణాపై లేఖ రాశారు. ఇటీవల కుప్పం పర్యటనలో అక్రమ క్వారీయింగ్‌పై పరిశీలించామన్నారు. అక్రమాలు నిజమేనని అధికారులు నిర్ధారించారని చంద్రబాబు లేఖలో తెలిపారు. అధికారుల తనిఖీల తర్వాత కూడా అక్రమ మైనింగ్‌ జరుగుతూనే ఉందన్నారు. అధికార పార్టీ నేతలు అక్రమ మైనింగ్‌లో భాగస్వాములై ఉండడంతో అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, దీంతో వందల ఎకరాల్లో అక్రమ మైనింగ్‌ జరుగుతోందని ఆరోపించారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని లేఖలో చంద్రబాబు ఏపీ సీఎస్‌ను కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories