219మందితో టీడీపీ రాష్ట్ర కమిటీ

Arun Chilukuri
Published on: 6 Nov 2020 12:53 PM IST
219మందితో టీడీపీ రాష్ట్ర కమిటీ
X

ఏపీ టీడీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. 219 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేశారు. వీరిలో 18 మంది ఉపాధ్యక్షులు, 16 మంది ప్రధాన కార్యదర్శులు, 18 మంది అధికార ప్రతినిధులు, 58 మంది కార్యనిర్వాహక కార్యదర్శులు, 108 మంది రాష్ట్ర కార్యదర్శులు, ఒక కోశాధికారి ఉన్నారు. బడుగు, బలహీన, ఎస్సీలకు 61శాతం పదవులు ఇచ్చామని టీడీపీ తెలిపింది. 50 ఉపకులాలకు ప్రాధాన్యం.. బీసీలకు 41శాతం, ఎస్సీలకు 11శాతం, ఎస్టీలకు 3శాతం, మైనార్టీలకు 6శాతం మందికి కొత్త కమిటీలో చోటు కల్పించారు. కమిటీలో ఉన్నవారి సగటు వయసు 48 ఏళ్లు కాగా.. మహిళలకు ప్రాధాన్యత లభించింది. వారసత్వం కంటే పనితీరుకే ప్రాధాన్యత ఇస్తూ ప్రతిపక్షంలో గళం వినిపిస్తున్న వారికి పదవులు కట్టబెట్టామని టీడీపీ చెబుతోంది. ఇప్పటి వరకూ పార్టీలో ఎటువంటి పదవులు లేని ఎంతో మంది కొత్తవారికి రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించామన్నారు.

కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి :-

నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డి

ఉపాధ్యక్షులు :-

నిమ్మల క్రిష్టప్ప

ప్రత్తిపాటి పుల్లారావు

జ్యోతుల నెహ్రూ

గొల్లపల్లి సూర్యారావు

బండారు సత్యానందరావు

రత్నం

దట్ల సుబ్బరాజు

సాయి కల్పనరెడ్డి

వేదవ్యాస్

సుజయకృష్ణ రంగారావు

జయనాగేశ్వర్‌రెడ్డి

వైవీబీ రాజేంద్రప్రసాద్

జి.తిప్పస్వామి

హనుమంతరాయ చౌదరీ

నర్సింహారెడ్డి

దామరచర్ల జనార్ధన్‌రావు

శ్రీధార కృష్ణరెడ్డి

వేమూరి ఆనంద్ సూర్య

ప్రధాన కార్యదర్శులు :-

పయ్యావుల కేశవ్

అనగాని సత్యప్రసాద్

దేవినేని ఉమామహేశ్వరరావు

అమర్నాథ్‌రెడ్డి

బాలవీరాంజనేయస్వామి

బీటీ నాయుడు

భూమా అఖిలప్రియ

ఎండీ నజీర్

గన్ని కృష్ణ

మద్దిపాటి వెంకటరాజు

పంచమర్తి అనురాధ

చంగల రాయుడు

గౌతు శిరీష

దువ్వారపు రామారావు

బుద్దా వెంకన్న

చింతకాయల విజయ్

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story