Seetharam: ఏపీలో విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామన్న స్పీకర్
Thammineni Seetharam: విద్యార్ధుల చదువుకు జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని కామెంట్
తమ్మినేని సీతారాం (ఫోటో-ది హన్స్ ఇండియా)
Thammineni Seetharam: రాష్ట్రంలో విద్యకు జగన్ మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారంటున్నారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం పేదరికం పారద్రోలడానికి, ప్రజల సంక్షేమం కోరి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. నేటి విద్యార్థి పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి ఇంగ్లీష్ విద్య అవసరం అని ఆయన స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కింతలి గ్రామంలో మనబడి నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా సుమారు రూ.88 లక్షల నిధులతో పనులు పూర్తిచేసిన పాఠశాలను స్పీకర్ ప్రారంభించారు. అనంతరం క్లాస్ రూములను పరిశీలించారు. అక్కడ ఉన్న విద్యార్ధులతో ముచ్చటించారు.
Next Story




