Srisailam: శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి అమ్మవార్ల హుండీ లెక్కింపు

Srisailam Temple Receives Hundi Offerings of Over Rs 2.21 Crore
x

శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి అమ్మవార్ల హుండీ లెక్కింపు

Highlights

Srisailam: రూ. 2,21,80, 968 రాబడి... 95 గ్రాముల 500 మిల్లీ గ్రాముల బంగారం.. 5 కేజీల 70 గ్రాముల వెండి

Srisailam: శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ లెక్కింపు ద్వారా మల్లన్న దేవస్థానానికి 2 కోట్ల 21 లక్షల 80 వేల 968 రూపాయల రాబడి లభించింది. ఈ ఆదాయాన్ని గత 18 రోజులలో స్వామి అమ్మవార్లకు భక్తులు నగదు రూపంలో సమర్పించినట్టు దేవస్థానం ఈవో తెలిపారు. వీటితో పాటు 95 గ్రాముల 500 మిల్లీ గ్రాముల బంగారం, 5 కేజీల 70 గ్రాముల వెండి లభించాయని ఇక వీటితో పాటు 277 యు.ఎస్.ఏ డాలర్లు, 151 కత్తార్ రియాల్స్, 52 సింగపూర్ డాలర్లు, 40 కెనడా డాలర్లు, 25 ఆస్ట్రేలియా డాలర్లు, 25 ఇంగ్లాండ్ ఫౌండ్స్ 1 ఎస్.ఏ.యు రియాల్స్ మొదలైన విదేశీ కరెన్సీ లభించాయి. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య హుండీ లెక్కింపు జరగగా.. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థానం అన్ని విభాగాల అధికారులు మరియు సిబ్బంది,శివసేవకులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories