Ayyannapatrudu: అయ్యన్న 'మార్క్' సెటైర్: 11వ తేదీన.. 11 మంది.. 11 నిమిషాలు! వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ చమత్కారం..!

Ayyannapatrudu: అయ్యన్న మార్క్ సెటైర్: 11వ తేదీన.. 11 మంది.. 11 నిమిషాలు! వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ చమత్కారం..!
x
Highlights

Ayyannapatrudu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సరదా వ్యాఖ్యలు చేశారు.

Ayyannapatrudu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లాబీలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సరదా వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైకాపా సభ్యులు అనుసరించిన తీరును ఉద్దేశించి ఆయన వేసిన చమత్కారాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఏం జరిగిందంటే?

నేడు (ఫిబ్రవరి 11) అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ప్రారంభం కాగానే, వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. అయితే, వారు సభలో ఎక్కువసేపు ఉండకుండా నిరసన తెలిపి కొద్దిసేపటికే వాకౌట్ చేశారు. ఈ పరిణామంపై మీడియా ప్రతినిధులతో ముచ్చటిస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తనదైన శైలిలో స్పందించారు:

"ఈ రోజు విచిత్రమైన యాదృచ్ఛికం జరిగింది. 11వ తేదీన.. 11 మంది సభ్యులు వచ్చి.. కేవలం 11 నిమిషాలు మాత్రమే ఉండి వెళ్లిపోయారు! అంతకుమించి వారు సభలో ఎక్కువ సమయం లేరుగా!" అని నవ్వుతూ వ్యాఖ్యానించారు.

సభా సంప్రదాయాలపై హితవు:

కేవలం చమత్కారానికే పరిమితం కాకుండా, గౌరవ సభ్యులు సభా సంప్రదాయాలను పాటిస్తే మంచిదని ఈ సందర్భంగా స్పీకర్ సూచించారు. గవర్నర్ ప్రసంగం అనేది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని, దానిని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన గుర్తు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories