ఫించిన్ ఇవ్వకపోతే పెట్రోలు పోసి తగలబెట్టేస్తామని బెదిరింపులు..

ఫించిన్ ఇవ్వకపోతే పెట్రోలు పోసి తగలబెట్టేస్తామని బెదిరింపులు..
x
Highlights

తమకి ఈ నెల రావాల్సిన పించిన్ ఎందుకు ఇవ్వలేదని పంచాయతీ కార్యదర్శిని కొందరు వ్యక్తులు బెదిరించిన వైనం అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి...

తమకి ఈ నెల రావాల్సిన పించిన్ ఎందుకు ఇవ్వలేదని పంచాయతీ కార్యదర్శిని కొందరు వ్యక్తులు బెదిరించిన వైనం అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే స్థానిక ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లిన కొందరు తమకి ఈ నెల పింఛన్ రాలేదు అని పంచాయతీ కార్యదర్శి నిలదీశారు. దానికి మురళీశర్మ సమాధానం ఇస్తూ ఈ నెల ఇవ్వడానికి లేదని, వచ్చే నెల నుంచి ఇస్తామని చెప్పుకొచ్చాడు. దీనితో ఆగ్రహానికి గురైన వారు మురళీశర్మ ను బెదిరించారు. వచ్చే నెలలో ఫించిన్ ఇవ్వకపోతే పెట్రోలు పోసి తగలబెట్టేస్తామని బెదిరించారు...ఆ కార్యాలయం లోనికి శివమ్మ అనే మహిళ కొడవలితో రావడంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కార్యాలయానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories