Dowleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజి దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక

Second Danger Alert At Dowleswaram Barrage
x

Dowleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజి దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక

Highlights

Dowleswaram Barrage: 175 గేట్లు ఎత్తి కిందకి నీరు విడుదల

Dowleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి నిలకడగా ఉంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి వరద ఉధృతి స్వల్పంగా తగ్గుతుంది. బ్యారేజీ వద్ద ప్రస్తుత నీటిమట్టం 14.20 అడుగులు మేర ఉంది. బ్యారేజీకి సంబంధించిన 175 గేట్లను పూర్తిగా ఎత్తి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ నుంచి 13 లక్షల 48 వేల క్యూసెక్కులు వరదనీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి వరద ఉధృతి తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories