కేంద్రం నుంచి సిబ్బందిని కేటాయించాలని లేఖలో ఎస్‌ఈసీ విన్నపం

కేంద్రం నుంచి సిబ్బందిని కేటాయించాలని లేఖలో ఎస్‌ఈసీ విన్నపం
x
Highlights

*కేంద్రానికి లేఖ రాసిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ *ఆర్టికల్ 324 ప్రకారం జిల్లా కలెక్టర్లకు ఎన్నికల నిర్వహణ బాధ్యతలు *ఆరోగ్యంగా ఉన్న ఉద్యోగులే విధుల్లో పాల్గొంటారు : ఉద్యోగ సంఘాలు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వివాదానికి ఈ రోజు సుప్రీం కోర్టు ఓ దారి చూపింది. ఎన్నికలు నిర్వహించాల్సిందే అంటూ సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఆరోగ్యవంతులైన ఉద్యోగులే ఎన్నికల విధులకు హాజరవుతారని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మెలిక పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్రానికి సంచలన లేఖ రాశారు.

సుప్రీం తీర్పు తర్వాత ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ ఎన్నికల నిర్వహణలో బీజీ అయ్యారు. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర కేబినెట్ కార్యదర్శికి నిమ్మగడ్డ ఓ లేఖ రాశారు. కొన్ని ఉద్యోగ సంఘాలు సహకరించబోమని ప్రకటిస్తున్నాయన్నారు. అందుకే కేంద్రం నుంచి సిబ్బందిని కేటాయించాలని లేఖలో కోరారు. ఎన్నికల కమిషన్‌ ఆర్టికల్ 324 ప్రకారం జిల్లా కలెక్టర్లకు ఎన్నికల నిర్వహణ అప్పజెప్పామని కలెక్టర్ల ఆధ్వర్యంలోనే ఎన్నికల విధులు నిర్వహించాలని భావిస్తున్నామని కేంద్రానికి లేఖలో తెలిపారు.

సుప్రీంకోర్టు తీర్పుపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు స్పందించారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌కు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఉద్యోగులంతా ఎన్నికల విధుల్లో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. ఆరోగ్యం సరిగాలేని ఉద్యోగులను మినహాయించి మిగిలిన వారితో ఎన్నికలు నిర్వహించుకోవచ్చన్నారు. తీర్పు పూర్తి కాపీ చూశాక స్పందిస్తామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories