Rushikonda Palace: రుషికొండపై కేబినెట్ సబ్ కమిటీ మరోసారి భేటీ

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్ అంశం మరో సారి హాట్ టాపిక్ గా నిలిచింది.

Arun Chilukuri
Published on: 24 Dec 2025 3:12 PM IST
Rushikonda Palace: రుషికొండపై కేబినెట్ సబ్ కమిటీ మరోసారి భేటీ
X

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్ అంశం మరో సారి హాట్ టాపిక్ గా నిలిచింది. ఇప్పటికే ఈ అంశంపై ఏపీ సర్కార్ కేబినెట్ సబ్ కమిటీ నియమించింది. మూడు సార్లు సబ్ కమిటీ సమావేశం అయ్యింది. రుషికొండ ప్యాలెస్ వినియోగంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా మరోసారి సచివాలయంలో రుషికొండ అంశంపై సబ్ కమిటీ భేటీ అయ్యింది.

రుషికొండ ప్యాలెస్ వినియోగంలో లేకపోయినా నెలకు 25 లక్షలు విద్యుత్ ఛార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు భరించాల్సి వస్తుందని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజాభిప్రాయాలు కొరుతూ గత సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story