APSRTC MD Dwaraka Tirumal Rao: ప్రగతిపథంలో ఏపీఎస్ఆర్టీసీ

RTC Md Dwaraka Tirumalrao On RTC Activities
x

APSRTC MD Dwaraka Tirumal Rao: ప్రగతిపథంలో ఏపీఎస్ఆర్టీసీ 

Highlights

APSRTC MD Dwaraka Tirumal Rao: ఏప్రిల్-ఆగస్టు వరకు బస్సుల్లో 76 శాతం ఒఆర్ సాధించినట్టు తెలిపారు

APSRTC MD Dwaraka Tirumal Rao: 2022-23 ఏడాదిలో ఏపీఎస్ ఆర్టీసీ ప్రగతి పథంలో ముందుకు వెళ్తుందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఏప్రిల్-ఆగస్టు వరకు బస్సుల్లో 76 శాతం ఒఆర్ సాధించినట్టు తెలిపారు. గత సెప్టెంబర్‌లో కార్గోలో డోర్ డెలివరీ విధానం అమలు ప్రారంభించామని... దీని ద్వారా సగటున రోజుకు 5802 పార్సిళ్లు బుక్ అవుతున్నాయన్నారు. గతంలో 972 ఉండగా... ఇది ఇప్పుడు 5 వందల శాతం పెరిగిందని చెప్పారు. గత ఏడాది ఆర్టీసీ కార్గోలో 122 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఆర్టీసీలో 998 కొత్త అద్దె బస్సుల కోసం టెండర్లు ఆహ్వానించామని చెప్పారు. ప్రయాణీకులు, ఆర్టీసీ లాభం కోసమే అద్దె బస్సులు తీసుకుంటున్నామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories