Andhra Pradesh: ప.గో.జిల్లా జంగారెడ్డిగూడెంలో రోడ్డుప్రమాదం

Road Accident In West Godavari District Jangreddygudem
x

Representational Image

Highlights

Andhra Pradesh: ట్రాక్టర్‌-లారీ ఢీ, 20 మందికి తీవ్రగాయాలు * 11 మంది పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు

Andhra Pradesh: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం బైపాస్‌లో రోడ్డుప్రమాదం జరిగింది. శ్రీనివాసపురం జంక్షన్‌ దగ్గర ఓ ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్‌లో ఉన్న 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. 11 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని.. ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిగిలిన 9 మంది జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులంతా కృష్ణాజిల్లా చిన్నవరం గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదుచేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గుబ్బల మంగమ్మ ఆలయానికి వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories