Nellore: నెల్లూరు జిల్లా ముంగమూరు వద్ద రోడ్డు ప్రమాదం

Road Accident At Mungamur Nellore District
x

 Nellore: నెల్లూరు జిల్లా ముంగమూరు వద్ద రోడ్డు ప్రమాదం 

Highlights

Nellore: ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు

Nellore: నెల్లూరు జిల్లా ముంగమూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని..కారు ఢీ కొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. దావులూరి శ్రీనివాసులు కుటుంబం శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొనేందుకు నిన్న స్వగ్రామానికి వచ్చింది. అయితే...పూజా సామాగ్రి కోసం కావలి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories