జగన్ ప్రభుత్వంలో కస్టోడియల్ టార్చర్పై ఎస్పీకి ఫిర్యాదు చేసిన రఘురామకృష్ణరాజు
Raghu Rama Krishnam Raju: వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్ పై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గుంటూరు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
జగన్ ప్రభుత్వంలో కస్టోడియల్ టార్చర్పై ఎస్పీకి ఫిర్యాదు చేసిన రఘురామకృష్ణరాజు
Raghu Rama Krishnam Raju: వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్ పై ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గుంటూరు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు కస్టడీలో తనపై హత్యాయత్నం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2021 మే 14వ తేదీన తన పుట్టిన రోజు సందర్బంగా కుటుంబ సబ్యులతో వేడుకలు జరుపుకుంటున్న సమంయలో ఏపీ సీఐడీ పోలీసులు సీఐడీ కస్టడీ ద్వారా హింసించారని తెలిపారు. ఆ ఘటనకు సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, అప్పటి సీఐడీ అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ బాధ్యులని తెలిపారు. తన ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎప్సీని కోరారు.
Next Story




