Droupadi Murmu: తిరుపతిలో రెండ్రోజుల పాటు రాష్ట్రప్రతి ముర్ము పర్యటన

Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి, తిరుమలకు రానున్నారు.

Arun Chilukuri
Published on: 20 Nov 2025 12:11 PM IST
Droupadi Murmu: తిరుపతిలో రెండ్రోజుల పాటు రాష్ట్రప్రతి ముర్ము పర్యటన
X

 Droupadi Murmu: తిరుపతిలో రెండ్రోజుల పాటు రాష్ట్రప్రతి ముర్ము పర్యటన

Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి, తిరుమలకు రానున్నారు. ఇవాళ సాయంత్రం తిరుపతి‎కి చేరుకుంటారు ముర్ము. అక్కడనుంచి నేరుగా పద్మావతి అమ్మవారిని దర్శించుకుని తిరుమలకు బయల్దేరి వెళతారు. ఆరు గంటలకు పద్మావతి అతిథిగృహం చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు..

రేపు ఉదయం వరాహస్వామిని, శ్రీవారిని దర్శించుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో తిరుపతి, తిరుమలలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. షాపులు, ఇతర వ్యాపార సంస్థలను పదిరోజులుగా మూసేయించారు. రాష్ట్రపతి పర్యటించే ప్రాంతం మొత్తాన్ని ఎస్పీ పర్యవేక్షణలో ఉంది‎.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story