విషాదం.. బాలింత డోలిలోనే మృతి

విషాదం.. బాలింత డోలిలోనే మృతి
x
Highlights

విజయనగరం సాలూరు మండలంలో విషాదం నెలకొంది. మరయ్యపాడుకు చెందిన గిరిజన బాలింత కొద్ది రోజులుగా విష జ్వరంతో బాధపడుతుంది. అయితే ఆ మహిళను స్థానిక వైద్య...

విజయనగరం సాలూరు మండలంలో విషాదం నెలకొంది. మరయ్యపాడుకు చెందిన గిరిజన బాలింత కొద్ది రోజులుగా విష జ్వరంతో బాధపడుతుంది. అయితే ఆ మహిళను స్థానిక వైద్య సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో పరిస్థితి విషమించడంతో బాలింతను కొండ మీద నుంచి మైదానపు ప్రాంతానికి డోలిలో తీసుకెళ్తున్నారు. అయితే అనారోగ్యంతో మార్గమధ్యంలో బాలింత మృతి చెందింది. మెరుగైన రవాణా సదుపాయాలు లేక బాలింత మృతి చెందిందని బాధిత బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories