![Police Arrested Bezawada Durga Temple Lion Idols Missing Case Accused Police Arrested Bezawada Durga Temple Lion Idols Missing Case Accused](https://assets.hmtvlive.com/h-upload/2021/01/21/309667-idols.webp)
విజయవాడ దుర్గమ్మ రథం వెండి సింహాల ప్రతిమలను చోరీ చేసిన దొంగ దొరికాడు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఈ కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. లాక్...
విజయవాడ దుర్గమ్మ రథం వెండి సింహాల ప్రతిమలను చోరీ చేసిన దొంగ దొరికాడు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఈ కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. లాక్ డౌన్ సమయంలో వెండి ప్రతిమలు చోరీకి గురయ్యాయని ఆలస్యంగా గుర్తించారు. దొంగలను పట్టుకునేందుకు 3 స్పెషల్ టీంలను నియమించారు. 8 నెలల పాటు శోధించి 41 మంది పాత నేరస్థులను విచారించారు. ఐనా ప్రయోజనం లేదు.
తాజాగా తూర్పుగోదావరి జిల్లా తునిలో ఓ దొంగతనం కేసులో బాలకృష్ణ అనే దొంగను పోలీసులు అరెస్టు చేశారు. తమదైన స్టైల్లో విచారించగా వెండి సింహాల ప్రతిమలను కూడా దొంగిలించినట్టు బాలకృష్ణ పోలీసులకు చెప్పాడు. వెంటనే తుని పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న వారికి సమాచారం అందించారు. నిందితుడుని విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
16 కిలోల 3 వెండి సింహాల ప్రతిమలను తునిలో ఓ జ్యుయలరీ షాపులో విక్రయించినట్టు నిందితుడు చెప్పినట్టు తెలుస్తోంది. అక్రమ వెండిని కొనుగోలు చేసి జ్యుయలరీ షాపు యజమానికి కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ విగ్రహాలను కరిగించారా లేక ఎక్కడైనా అమ్మేశారా అనే కోణంలో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. దీంతో దుర్గగుడి వెండి సింహాల ఛోరీ కేసు కొలిక్కివచ్చినట్టయింది.
![](/images/logo.png)
About
![footer-logo](/images/logo.png)
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire