Permission to tourists in AP: ఏపీలో సెప్టెంబర్ మొదటి వారం నుంచి పర్యాటకులకు అనుమతి..మంత్రి అవంతి!

Andhra Pradesh Tourism Minister Avanthi Srinivas
x
Avanthi Srinivas
Highlights

ఏపీలో 3 ఇంటర్నేషనల్ స్టేడియాల నిర్మాణం * 20న సీఎం జగన్ చేతుల మీదుగా నూతన పర్యాటక పాలసీ ఆవిష్కరణ * తొట్లకొండలో బుద్ధిస్ట్ మ్యూజియం నిర్మాణం * మంత్రి అవంతి శ్రీనివాస్

రాష్ట్రంలో 3 ఇంటర్నేషనల్ స్టేడియాల నిర్మించాలని నిర్ణయించామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 20న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా నూతన పర్యాటక పాలసీని తీసుకురాబోతున్నామన్నారు. పీపీపీ పద్ధతిలో చేపట్టబోయే ఈ స్టేడియాల నిర్మాణంపై సీఎం జగన్మోహన్ రెడ్డితో జరిగే రివ్యూ తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో టూరిజం, స్పోర్ట్సు, కల్చరల్, ఆర్కియాలజీ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం మంగళవారం నిర్వహించారు. అనంతరం మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, పర్యాటక శాఖలో జరుగుతున్న పనులను మరింత వేగవంతం చేయడానికి సంబంధిత కాంట్రాక్టర్లతో తక్షణం మాట్లాడాలని ఆదేశించిన‌ట్లు చెప్పారు. అదేవిధంగా సెప్టెంబర్ మొదటి వారంలో పర్యాటక ప్రాంతాల్లోకి సందర్శకులకు అనుమతిస్తామ‌న్నారు. ఈ లోగా పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధిపై ఇటీవల కేంద్ర క్రీడల శాఖ మంత్రి మాట్లాడినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో క్రీడల ప్రోత్సాహించడంలో భాగంగా గతేడాది మాదిరిగా ఈ ఏడాది కూడా రూ.3 కోట్ల ను మంజూరు చేసి, జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు వైఎస్సార్ ప్రతిభా క్రీడా పురస్కారాలు అందజేయనున్నామన్నారు. జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించిన వారికి రూ.5 లక్షలు, వెండి పతక విజేతకు రూ.3 లక్షలు, రజతం సాధించిన వారికి రూ.2 లక్షల చొప్పున్న ప్రోత్సాహాకాలు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.

నూతన పర్యాటక పాలసీ...

ఈ నెల 20 సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పర్యాటక శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. ఈ సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా నూతన పర్యాటక పాలసీ తీసుకురానున్న‌ట్లు తెలిపారు. సీఎం అనుమతితో పర్యాటక శాఖలో పెండింగ్ పనులను పీపీపీ పద్ధతిలో చేపట్టే ఆలోచన ఉందన్నారు. రాష్ట్రంలో 12 ప్రాంతాల్లో ఒబెరాయ్ హాటల్ తరహాలో స్టార్ హోటళ్ల నిర్మాణానికి నిర్ణయించామన్నారు. దీనిపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చర్చంచి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.

బుద్ధిస్ట్ మ్యూజియం...

విశాఖపట్నంలోని తొట్లకొండలో బుద్ధిస్ట్ మ్యూజియంతో పాటు మెడిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. దీనిపై సీఎంతో జరిపే రివ్యూలో నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి వెల్లడించారు. తొట్లకొండ అంతీర్జాతీయ పర్యాటక ప్రాంతంగా పేరుగాంచిందని మంత్రి తెలిపారు. దేశ విదేశాల నుంచి ఎందరో పర్యాటకులు తొట్లకొండకు వస్తుంటారన్నారు. ఇటువంటి చారిత్రాత్మక ప్రాంతంలో బుద్ధిస్ట్ మ్యూజియం ఏర్పాటు చేయడం వల్ల మరింత మంది పర్యాటకలను ఆకట్టుకునే అవకాశం ఉందన్నారు.

సీఎం చేతుల మీదుగా కొండపల్లి ఫోర్టు, బాపూ మ్యూజియం ప్రారంభం...

మైలవరంలోని బాపూ మ్యూజియంతో పాటు మరమ్మతుల అనంతరం సిద్ధమైన కొండపల్లి ఫోర్టును త్వరలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. సింహాచలం దేవస్థానంలో రూ.50 కోట్ల కేంద్ర ప్రభుత్వ 'ప్రసాద్' పథకం కింద పనులకు త్వరలో శంకుస్థాపన చేయనున్నామన్నారు. శ్రీశైలం దేవస్థానంలో పూర్తయిన ప్రసాద్ పథకం పనులకు సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నామన్నారు. అంతకుముందు నిర్వహించిన రివ్యూలో... బోట్ల నిర్వహణలో తీసుకుంటున్న చర్యల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. బోట్ల నిర్వహణపై ఇతర రాష్ట్రాల్లో తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. సమావేశంలో ఏపీటీఏ సీఈవో, ఏపీటీడీసీ ఎండి ప్రవీణ్‌కుమార్, శాప్ ఎండి బి.రామారావు, ఆర్కియాలజీ డైరెక్టర్ వాణీమోహన్, శిల్పారామం సీఈవో జయరాజ్, సంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లిఖార్జున తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories