లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి చిత్తూరులో కరోనా పూజలు

లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి చిత్తూరులో కరోనా పూజలు
x
Highlights

భక్తులు లాక్‌డౌన్‌ నిబంధనలు తుంగలో తొక్కారు. దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ చిత్తూరు జిల్లా కొండసముద్రం గ్రామంలో స్థానికులు...

భక్తులు లాక్‌డౌన్‌ నిబంధనలు తుంగలో తొక్కారు. దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ చిత్తూరు జిల్లా కొండసముద్రం గ్రామంలో స్థానికులు కరోనా రావొద్దంటూ గంగమ్మ తల్లికి పూజలు చేశారు. గుంపులు గుంపులుగా బయటకొచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాళ్లపై బొమ్మలు చిత్రీకరించి పూజలు చేశారు. గ్రామంలోకి వైరస్ రావొద్దంటూ మొక్కుకున్నారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో చిత్తూరు జిల్లాను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. అయితే ఏ ఒక్కరికీ మాస్క్‌లు లేవు. మాస్క్‌లు ధరించి.. సామాజిక దూరం పాటిస్తే.. కరోనా దరిచేరదని ప్రభుత్వాలు చెబుతుంటే వాటిని పట్టించుకోలేదు.


Show Full Article
Print Article
Next Story
More Stories