People Self Lockdown in AP: ఎక్కడికక్కడే లాక్ డౌన్.. స్వచ్చందంగా విధించుకుంటున్న ప్రజలు, వ్యాపార వర్గాలు

People Self Lockdown in AP: ఎక్కడికక్కడే లాక్ డౌన్.. స్వచ్చందంగా విధించుకుంటున్న ప్రజలు, వ్యాపార వర్గాలు
x
Lockdown in AP
Highlights

People Self Lockdown in AP: అటు అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం వరకు ఎక్కడ చూసినా కరోనా కేసులే... కరోనా మరణాలే..

People Self Lockdown in AP: అటు అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం వరకు ఎక్కడ చూసినా కరోనా కేసులే... కరోనా మరణాలే... అయితే ప్రభుత్వం చేసింది చేస్తోంది... అయినా ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయలేకపోతున్నారు. దీనివల్ల కేసుల తీవ్రత పెరగడంతో పాటు గతంలో మాదిరి కాకుండా మరణాల శాతం పెరుగుతూ వస్తోంది. దీనిని కట్టడి చేయాలంటే ఏకైక మార్గం లాక్ డౌన్ గానే ప్రజలు గుర్తించారు. దీనిని వ్యాపార వర్గాలు సైతం తన మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ విధంగా ప్రతి చోట స్థానికంగా ఉండే అధికారుల సమక్షంలో అందరూ కలిసి లాక్ డౌన్ విధించుకునేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

అయితే ఈ లాక్ డౌన్ కొన్ని చోట్ల ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు, మరికొన్ని చోట్ల ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు షాపులు తెరిచి ఉంచేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక ఆ తరువాత ప్రజలెవ్వరైనా అత్యవసర పనులకు తప్ప రోడ్డు మీదకు రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇది కేసుల తీవ్రతను బట్టి ప్రతి జిల్లాలోనూ నేటి నుంచి కొనసాగుతోంది. విజయనగరం జిల్లాలో సాక్షాత్తూ లాక్ డౌన్ తప్పదన్నట్టు మంత్రి బొత్సా స్వయంగా ప్రకటించారు. ఈ విధంగా రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉండటంతో మరలా లాక్ డౌన్ ను పున: ప్రారంభిస్తున్నారు.

ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఇక గుంటూరు జిల్లాలో రోజు రోజుకి కోవిడ్-19 కేసులు గణనీయంగా పెరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో విజృంభన ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు, జిల్లాలో ప్రస్తుతం ఇప్పటి వరకు నమోదైన కరోన కేసుల సంఖ్య 5000 పైచిలుకు కాగా వారిలో 1829 మనది కరోన మహమ్మరిని జయించారు, ఇప్పటికీ 32 మంది కరోనాకు బలి అయ్యారు.

శనివారం నుంచి జిల్లా వ్యాప్తంగా పూర్తి లాక్ డౌన్ అమలలో ఉంటుందని జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. ఉదయం 6 గంటల నుండి ఉదయం 11 గంటల వరకు మాత్రమే నిత్యవసర సరకుల కొనుగోళుకు అనుమతి ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. కరోనా నియంత్రణలో భాగంగా శనివారం నుంచి వారం రోజుల పాటు పూర్తి లాక్ డౌన్ అమలులో ఉంటుందని తెలిపారు. అత్యవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలని సూచించారు.

కరోనా కట్టడిలో భాగంగా మాస్క్ తప్పని సరిగా ధరించాలని… సామాజిక దూరం పాటిస్తూ.. శానిటైజర్లు వియోగించాలని జిల్లా ప్రజలకు కలెక్టర్ సూచనలు జారీ చేశారు. కరోనా నియంత్రణ కు సహకరించాలని ఆయన జిల్లా ప్రజలకు కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories