తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

Arun Chilukuri
Published on: 4 Dec 2019 11:43 AM IST
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
X
పవన్ కళ్యాణ్

ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుందని తన చిన్నతనంలో నేర్చుకున్న పాఠాన్ని త్రికరణశుద్ధిగా నేటికి పాటిస్తున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం రాయలసీమకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు.

ఈ సందర్భంగా ఆలయ అధికారులు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పవన్ కళ్యాణ్ కు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మూడు దశాబ్దాల క్రితం తిరుపతిలో ఆయన యోగాభ్యాసం నేర్చుకున్న జ్ఞాపకాలని‌ గుర్తు చేసుకున్నారు. దేశం సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వెంకటేశ్వర స్వామి వేడుకున్నట్లు పవన్ మీడియాకు తెలిపారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story