Pawan Kalyan: కరోనాతో ప్రజలు అల్లాడిపోతుంటే.. అరెస్టులా?: పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ఏపీ సర్కార్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ధ్వజమెత్తారు.

Kranthi
Published on: 15 May 2021 8:45 AM IST
Pawan Kalyan: కరోనాతో ప్రజలు అల్లాడిపోతుంటే.. అరెస్టులా?: పవన్ కళ్యాణ్
X

Pawan Kalyan:(File Image) 

Pawan Kalyan: ఏపీ సర్కార్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ధ్వజమెత్తారు. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అరెస్టుపై పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో స్పందించారు. కరోనాతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతుంటే వారిని గాలికొదిలేసిన ప్రభుత్వం ఇలాంటి పనులు చేయడం ఎంతమాత్రమూ సమర్థనీయం కాదని అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్న ఏకైక కారణంతో సమయం, సందర్భం లేకుండా ఇలాంటి పనులేంటని నిలదీశారు. జనసేన పార్టీ దీనిని తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రాష్ట్రం నుంచి హైదరాబాద్ వెళ్లే అంబులెన్సులను సరిహద్దుల్లో అడ్డుకుంటుంటే ఆ విషయం గురించి పట్టించుకోవడం మానేసి ఇలాంటి పనులపై దృష్టి పెట్టడం మంచిది కాదని పవన్ హితవు పలికారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా రఘురామ కృష్ణరాజు అరెస్టును తీవ్రంగా ఖండించారు. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు పోలీసు వ్యవస్థను వాడుకోవడం దురదృష్ణకరమన్నారు. వైసీపీ ప్రభుత్వ నిరంకుశత్వానికి, అసహనానికి ఎంపీ అరెస్టు నిదర్శనమని మండిపడ్డారు.

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశాడంటూ ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాదులోని ఆయన నివాసంలో అరెస్ట్ చేయడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీలకు అతీతంగా రఘురామకృష్ణరాజు అరెస్ట్ ను తప్పుబడుతున్నారు.

Kranthi

Kranthi

Next Story