అనకాపల్లి జిల్లాలో కొనసాగుతున్న ఆపరేషన్ టైగర్
Anakapalle: రెండు వారాలుగా కంటిమీద కునుకులేకుండా చేస్తున్న పులి
అనకాపల్లి జిల్లాలో కొనసాగుతున్న ఆపరేషన్ టైగర్
Anakapalle: అనకాపల్లి జిల్లాలో ఆపరేషన్ టైగర్ కొనసాగుతోంది. రెండు వారాలుగా అనకాపల్లి జిల్లా వాసులకు పులి సంచారం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇప్పటివరకు మూడు ఆవుదూడలపై పంజా విసిరింది. మరోవైపు పులిని బంధించేందుకు రెండు బోన్లతో పాటు దాని కదలికలను గుర్తించేందుకు ఆరోచోట్ల కెమెరాలు ఏర్పాటు చేశారు అధికారులు.
రోజూ పులి తన మకాం మార్చుకుంటూ ఈశాన్య దిశగా పయనిస్తున్నట్టు గుర్తించారు. దీంతో సబ్బవరం మండలంలోని నారపాడు, నల్లరేగులపాలెం అటవీ ప్రాంత పరిధిలో పులి సంచరించే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.
Next Story




