Gali Janardhan Reddy: చంచల్‌గూడ జైల్లో అదనపు సౌకర్యాలు కల్పించండి.. గాలి జనార్ధన్ రెడ్డి పిటిషన్

ఓబుళాపురం మైనింగ్ కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం సీబీఐ కోర్టు గాలి జనార్దనరెడ్డిని దోషిగా నిర్ధారించి ఏడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.

Arun Chilukuri
Published on: 14 May 2025 2:49 PM IST
Obulapuram Mining Scam Gali Janardhan Reddy Petition
X

Gali Janardhan Reddy: చంచల్‌గూడ జైల్లో అదనపు సౌకర్యాలు కల్పించండి.. గాలి జనార్ధన్ రెడ్డి పిటిషన్

Gali Janardhan Reddy: ఓబుళాపురం మైనింగ్ కుంభకోణం (Obulapuram Mining Scam) కేసులో చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్న గాలి జనార్దనరెడ్డి (Gali Janardhan Reddy), తనకు జైలులో అదనపు సౌకర్యాలు కల్పించాలని కోరుతూ నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.

ఏడేళ్ల జైలు శిక్ష పొందిన గాలి జనార్దనరెడ్డి

ఓబుళాపురం మైనింగ్ కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం సీబీఐ కోర్టు గాలి జనార్దనరెడ్డిని దోషిగా నిర్ధారించి ఏడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు.

అదనపు సౌకర్యాల కోసం కోర్టులో పిటిషన్

జైలులో ఇప్పటికే అందుతున్న వసతులకు తోడు, మరిన్ని వ్యక్తిగత, ఆరోగ్య సంబంధిత అదనపు సదుపాయాలు కావాలని గాలి జనార్దనరెడ్డి అభ్యర్థించారు. ఇందుకోసం తన న్యాయవాదుల ద్వారా నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ పిటిషన్ కోర్టు రిజిస్ట్రీ వద్ద పరిశీలనలో ఉంది. త్వరలో విచారణకు స్వీకరించాలా అనే విషయంలో న్యాయమూర్తి నిర్ణయం తీసుకోనున్నారు.

ఓబుళాపురం మైనింగ్ కేసు నేపథ్యం

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓబుళాపురం మైనింగ్ స్కాం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో గాలి జనార్దనరెడ్డి, ఆయన సహచరులు అక్రమంగా ఖనిజ సంపదను తవ్వి వేల కోట్ల రూపాయల మేర అక్రమ ఆదాయాన్ని సంపాదించినట్లు సీబీఐ ఆధారాలు సేకరించింది. విచారణ అనంతరం కోర్టు ఆయనకు శిక్ష విధించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story