Andhra Pradesh: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఉద్యోగుల ఆందోళన

NTR Health University Employees Protest
x

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ (ఫైల్ ఇమేజ్)

Highlights

Andhra Pradesh: వీసీ ఛాంబర్‌లో బైఠాయించి నినాదాలు

Andhra Pradesh: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. వీసీ ఛాంబర్‌లో బైఠాయించి నినాదాలు చేశారు. మా బాస్ చెప్పినట్లే వింటానని వీసీ చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపటి నుంచి జేఏసీగా ఏర్పడి ఉద్యమం ఉధృతం చేస్తామంటున్నారు. ఇక ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో-25 ద్వారా బ్యాంకులలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ డిపాజిట్లకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్శిటీ నిధులు 448 కోట్లను కష్టపడి జమచేశామని వీటిలో 400 కోట్లు ప్రభుత్వం కొత్త సంస్థకు ఏకపక్షంగా వీసీ బదిలీ చేశారని ఆరోపిస్తున్నారు ఉద్యోగులు.

Show Full Article
Print Article
Next Story
More Stories