Breaking News: ఏపీ నూతన ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని

ఎస్‌ఈసీగా నీలం సాహ్నీని నియమించిన గవర్నర్‌

Arun Chilukuri
Updated on: 26 March 2021 9:01 PM IST
Neelam Sahni Appointed has Andhra Pradesh New state election commissioner
X

Breaking News: ఏపీ నూతన ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని

Breaking News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్నిని గవర్నర్ నియమించారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైరైన సాహ్ని ప్రస్తుతం సీఎం జగన్ ముఖ్య సలహాదారుగా కొనసాగుతున్నారు. ప్రస్తుత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. దాంతో, ముగ్గురి పేర్లతో గవర్నర్ కు ప్రతిపాదనలు పంపించింది ఏపీ సర్కార్. ముగ్గురిలో సాహ్ని పేరునే గవర్నర్ బీబీ హరిచందన్ ఖరారు చేశారు. ఏప్రిల్ ఒకటో తేదీన కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరిస్తారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story