Chandrababu Arrest: రాజ్‌ఘాట్‌లో నారా లోకేష్‌ సహా టీడీపీ నేతల మౌనదీక్ష

Chandrababu Arrest: ఏపీ ప్రభుత్వం విధ్వంసకర కార్యక్రమాలు చేస్తోందని, రాజ్యాంగ వ్యవస్థలను కాలరాస్తోందని విమర్శించారు టీడీపీ నేతలు.

Arun Chilukuri
Published on: 19 Sept 2023 9:51 AM IST
Nara Lokesh With MPs State Silent Protest at Raj Ghat
X

Chandrababu Arrest: రాజ్‌ఘాట్‌లో నారా లోకేష్‌ సహా టీడీపీ నేతల మౌనదీక్ష

Chandrababu Arrest: ఏపీ ప్రభుత్వం విధ్వంసకర కార్యక్రమాలు చేస్తోందని, రాజ్యాంగ వ్యవస్థలను కాలరాస్తోందని విమర్శించారు టీడీపీ నేతలు. ఫ్రీడమ్‌ ఆఫ్‌ స్పీచ్‌ను హరించి వేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. చంద్రబాబుపై ఆధారాల్లేని కేసులు మోపి జైల్లో పెట్టారని ఆరోపించారు. ఢిల్లీ రాజ్‌ఘాట్ దగ్గర జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మౌనదీక్ష చేపట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నల్ల రిబ్బన్లు ధరించి ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎంపీలు, మాజీ ఎంపీలు పాల్గొన్నారు. అంతకుముందు మహాత్మాగాంధీ సమాధి దగ్గర లోకేష్‌ నివాళులర్పించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story