సన్న‌గడ్డి పెట్టడానికి రెడీగా ఉన్నారు: లోకేష్

Arun Chilukuri
Updated on: 15 Feb 2021 4:29 PM IST
సన్న‌గడ్డి పెట్టడానికి రెడీగా ఉన్నారు: లోకేష్
X

సన్న‌గడ్డి పెట్టడానికి రెడీగా ఉన్నారు: లోకేష్

వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై ట్విట్టర్‌ వేదికగా టీడీపీ నేత నారా లోకేష్‌ విమర్శలు గుప్పించారు. సన్నబియ్యం అన్న సన్నాసులు.. దొడ్డు బియ్యానికే పాలిష్‌ కొట్టి నాణ్యమైన బియ్యమంటూ మాయ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాలను రేషన్‌ పంపిణీ చేసే వ్యాన్ల ఎదుట క్యూలైన్లలో నిలబెట్టి హింసిస్తున్నారని మండిపడ్డారు. పబ్లిసిటీకి, రియాలిటీకి మధ్య తేడా ఇదేనని ఎద్దేవా చేశారు. డోర్‌ డెలివరీ మాయలోడు జగన్‌రెడ్డి కనపడితే సన్నగడ్డి పెట్టడానికి అక్క చెల్లెమ్మలు క్యూలో రెడీగా ఉన్నరంటూ లోకేష్‌ ట్వీట్‌ చేశారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story