
Nara Lokesh: నిర్బంధం తీవ్రమైతే తిరుగుబాటు ఉద్ధృతం..
Nara Lokesh: ఏపీలో ఎమర్జెన్సీ ఏమైనా విధించారా..? అంటూ ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు నారా లోకేష్.
Nara Lokesh: ఏపీలో ఎమర్జెన్సీ ఏమైనా విధించారా..? అంటూ ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు నారా లోకేష్. చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ విజయవాడలో నిరసన తెలపాలనుకున్న కాలేజీ విద్యార్థులపై పోలీసుల జులుం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాలల్లోకి పోలీసులు చొరబడటం ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు లోకేష్. వారికి పోలీసులే సెలవు ప్రకటించడం వెనుక ప్రభుత్వ ఆదేశాలే కారణం అని ఆయన ఆరోపించారు. నిర్బంధం తీవ్రమైతే తిరుగుబాటు ఉద్ధృతం అవుతుంది అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. ఐతే చంద్రబాబుకు మద్దతుగా రోడ్లపై నిరసనకు సిద్ధమయ్యారు విద్యార్థులు. దీంతో కళాశాలల నుంచి విద్యార్థులను పోలీసులు ఖాళీ చేయించడం చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ లో అత్యవసర పరిస్థితి ఏమైనా విధించారా? చంద్రబాబు గారి అక్రమ అరెస్టుపై శాంతియుతంగా నిరసన తెలపాలనుకున్న విజయవాడలో వివిధ కళాశాలల విద్యార్థులపై పోలీసుల జులుం దుర్మార్గం. సిద్ధార్ధ, పీవీపీ ఇంజినీరింగ్ కళాశాలల్లోకి పెద్దఎత్తున పోలీసులు చొరబడటం ఎమర్జెన్సీని తలపిస్తోంది.… pic.twitter.com/t33wI8b6nQ
— Lokesh Nara (@naralokesh) September 15, 2023

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



